- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Amarnath: మీ స్టాండ్ ఏంటో చెప్పండి.. సీఎం కేసీఆర్కు ప్రశ్నల వర్షం
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయాలనుకోవడంపై ఏపీ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు...

X
దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయాలనుకోవడంపై ఏపీ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకూడదనేదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. అలాంటి ప్లాంట్లో తెలంగాణ ప్రభుత్వం బిడ్ ఎలా వేస్తోందని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం సరికాదన్న కేసీఆర్ ఇప్పుడు బిడ్ ఎందుకు వేస్తున్నారని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ను అమ్మేయమనేదే వారి ఉద్దేశమా? అని మంత్రి వ్యాఖ్యానించారు . అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమ స్టాండ్ ఏమిటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అని, దాన్ని ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.
Read more:
Next Story






